Monday, April 28, 2014

యోగా ప్రదర్శన - కుమారి తూమాటి స్రవంతి

           మహిళల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 8వ వార్షికోత్సవము 27-4-14 న శ్రీ వెంకట కృష్ణ శుభ మండపము లో జరిగింది. ఈ సంస్ధకు డా. కందిమళ్ల జయమ్మ గారు అధ్యక్షులు. ఈ సందర్భంగా పసుమర్రు కు చెందిన కుమారి తూమాటి స్రవంతి యోగా ప్రదర్శన చేసి ప్రేక్షకులను అబ్బుర పరిచారు.