Wednesday, November 9, 2011

కార్తిక పౌర్ణమి (10-11-2011)

కార్తీక మాసము 27-10-11 న ప్రారంభమైనది. ప్రతి రోజు వేకువ జామునే స్నానాలు చేసి, దీపం వెలిగిస్తారు. తర్వాత దగ్గరలో ఉన్న శివాలయమునకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. పగలంతా ఉపవాసము ఉంది, సాయంత్రం నక్షత్రాలను చూసి భోజనం చేస్తారు. కార్తీక మాసం స్నానాలు ప్రవహించే నీటిలో చేయాలని నియమం. అవకాశం లేని చోట బావి నీటిని ఉపయోగిస్తారు. కార్తీక మాసంలో గోపాదమంత ప్రదేశంలో ఉన్న నీటిలోనైన ముక్కోటి దేవతలు ఉంటారని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలో పవిత్ర స్నాన మాచరించి, ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయంలో దీపారాధన చేసినచో సర్వ పాపాలు నశిస్తాయని చెబుతారు.

ఫైల్ ఫోటో (గత సంవత్సరం)
గ్రామంలో కార్తీక మాస పవిత్ర స్నానాల సందడి మొదలైంది. ప్రవహించే నిరు అందుబాటులో లేనందున భక్తులు పెద్ద సంఖ్యలో బావుల వద్ద పవిత్ర స్నానమాచరించారు. పూలతో సుందరంగా అలంకరించబడిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు జరుపుతున్నారు . గ్రామంలో భక్తులందరికీ గోత్ర నామాలతో పెద్ద సంఖ్యలో అభిషేకాలు చేయటం మొదలైనది.


కార్తీక మాసంలో మన గ్రామంలో జరిగే విశిష్టమైన కార్యక్రమం అఖండ దీపోత్సవం. కార్తీక పౌర్ణమి అఖండాల పండుగ నవంబర్ 10 తేదిన సాయంత్రం జరుగును.

జ్వాల తోరణం ( గత సంవత్సరం ఫైల్ ఫోటో)

No comments:

Post a Comment