Saturday, October 24, 2015

దసరా నాడు కొండవీడు వద్ద ఇస్కాన్ స్వర్ణ మందిర భూమి పూజ కార్యక్రమం 22-10-15


విజయదశమి రోజునే ఇస్కాన్ స్వర్ణ మందిర భూమిపూజా కార్యక్రమం ఉంటుందని ఇస్కాన్ కొండవీడు ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యగోపినాధ్ దాస్ తెలిపారు. ఇస్కాన్ స్వర్ణ మందిర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసిన 16.54 ఎకరాల దేవాదాయ భూమిలో ఈ భూమిపూజా కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ 16.54 దేవా దాయ భూమి సముదాయంలో 80160 కొలతలతో స్వర్ణ మందిర నిర్మాణం ఉంటుందని దీని చుట్టూత కృష్ణలీల,రామలీల మ్యూజియం, ఆధ్యాత్మిక శ్రాస్తా లపై అవగాన పెంపొందించే ఉద్దేశంతో రూపొందే విజువల్ థియేటర్ ఉంటా యని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని హంస ప్రాజెక్ట్‌గా నామకరణ చేయడం జరి గిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నవనీత బాలకృష్ణూని విగ్రహం ఛెంఘీజ్ ఖాన్‌పేట గ్రామంలో ఉండడం యడ్లపాడు మండలానికే గర్వకారణమని, నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో నవనీత బాలకృష్ణూనికి స్వర్ణ దేవాలయాన్ని నిర్మించి కొండవీడు పేరు ప్రఖ్యాతులు దశదిశల వ్యాప్తి చేస్తామని సత్య గోపినాధ్‌దాస్ పేర్కొన్నారు. అమరావతి నగరం రాజధాని కాబోతున్న నేపధ్యం లో రెడ్డి రాజులు పరిపాలించిన కొండవీటికోటకు పూర్వ వైభవం వచ్చిం దన్నారు. కొండవీడు పరిసర ప్రాంతమైన ఛెంఘీజ్‌ఖాన్‌పేటలో సుమారు రూ. 500 కోట్లతో ఇస్కాన్ థీమ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాబోతుందన్నారు.    టెక్స్ట్ కర్టెసీ: సూర్య తెలుగు దిన పత్రిక,  ఫొటో కర్టెసీ : వివేకానంద సేవా సమితి, చిలకలూరి పేట 





No comments:

Post a Comment