Wednesday, July 16, 2014

శ్రీ కృష్ణ ధ్యాన మందిరం - నాదెండ్ల

     
ప్రారంభం: 08-09-2013
పిరమిడ్ కొలతలు : 20X 20X 18 
జ్యోతి ప్రజ్వలన :  శ్రీ లక్ష్మణ రావు గారు, MLC 

ప్రారంభకులు : శ్రీ K .V. రావు గారు , మాస్టర్ , వైజాగ్ 

నాదెండ్ల గ్రామం లోని హరే రామ గుడికి దగ్గరలో పెద్ద పిరమిడ్ ధ్యాన మందిరమును నిర్వహించబడుతున్నది. ఇంత పెద్ద పిరమిడ్ ను ఇంటి మీద ఎవరు కట్టించారు? కట్టించడానికి గల కారణమేదో నిర్వాహకులను  జరిగినది .

     పిరమిడ్ ను నిర్మించి నిర్వహిస్తున్నది నాదెండ్ల గ్రామస్తులైన సలిశం  ఆంజనేయులు, లక్ష్మి పద్మ దంపతులు. ఆంజనేయులు గారు దక్షిణ ఆఫ్రికా లో ఒక సిమెంట్ కంపెనీ లో ప్రాసెస్ మేనేజర్ గా పని చేస్తున్నారు   . వారికి ఇద్దరు సంతానం . పిల్లల చదువుల నిమిత్తమై వారు విజయవాడలో ఉండే వారు. వారి పాప పావని మెడిసిన్ చదువుతున్నది. బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దురదృష్ట వశాత్తు మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం లో  మరణించాడు . కొడుకు చనిపోవడంతో తీవ్రమైన దుః ఖం లో మునిగి పోయారు ఆ దంపతులు . పుత్ర వియోగం  నుండి   తేరుకోలేక పోయిన ఆంజనేయులు గారిని ధ్యానం చేయమని సలహా ఇచ్చారు తెలిసిన వారు .

     మార్పు కొరకు అన్నట్లు బెంగళూరు లోని పిరమిడ్ వాలీ లో 41 రోజుల ధ్యాన శిక్షణ కు వీరు వెళ్ళటం జరిగినది . ఆంజనేయులు గారు అక్కడ ధ్యానం లో పూర్తిగా లీనమై అనుభూతి పొందారు. ధ్యాన శిక్షణ పూర్తీ అయ్యే నాటికి  పిరమిడ్ ధ్యానం లో చెప్పే 'ఆనాపాన  సతి ' అనగా "శ్వాస మీద ధ్యాస నిల్పుట "ను సాధించారు.  మాములు మనిషి కాగలిగారు .



     తను పొందిన అనుభూతి అందరికి అందించాలనే భావన కలిగి ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకున్నారు . మొదట విజయవాడ లోనే ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, స్వగ్రామమైన నాదెండ్ల లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిలాషించారు . ఇప్పుడు పిరమిడ్  నిర్మించిన స్థల స్వంత దారులను కలిసి వారికి  తమ ఆలోచన వివరించారు . వారికి  స్థలం  అమ్మే ఉద్దేశం లేనప్పటికీ వీరి సంకల్పానికి వారు స్పందించారు . పిరమిడ్ వరకు నిర్మిస్తే తరువాత నిర్వహణ కష్టం గా  ఉంటుందని భావించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు, ఆ పైన మొదటి అంతస్తు లో పిరమిడ్ నిర్మించాలని నిర్ణయించారు . పదవీ విరమణ తరువాత ఇక్కడ ఉండి  పూర్తి స్థాయిలో ధ్యానశిక్షణ  తరగతులు నిర్వహించాలని అనుకుంటున్నారు .

 












    
 ఈ మధ్యనే పిరమిడ్ నిర్మాణం పూర్తి అయింది . ఒక రోజు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి . ధ్యాన సాధకులు వెళ్ళి పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటున్నారు  . ఇక త్వరలో 41 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు . ఈ కార్యక్రమాలను ఆంజనేయులు గారి శ్రీమతి లక్ష్మీ పద్మ గారు పర్యవేక్షిస్తున్నారు .

        


     


 తాము  ఏదైతే మంచి అనుభూతిని పొంది, బాధల నుండి విముక్తి అయ్యమో ఆ మంచి అనుభూతిని అందరికీ  అందించాలనే సంకల్పం తోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దీనికి గ్రామంలోని ధ్యాన సాధకులు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు . 




       తాము పొందిన మంచిని అందరికి అందించాలనే సంకల్పం పెట్టుకొని దాని కొరకు అవిరళ కృషి చేస్తున్న ఆంజనేయులు దంపతుల ప్రయత్నం నూరు శాతం విజయవంతం కావాలని కోరుకొంటూ వారి నిస్వార్ధ  ప్రయత్నానికి నాదెండ్ల ఆన్ లైన్ అభినందనలు తెలియ చేస్తుంది .
                              

    సర్వే జనాః సుఖినో భవంతు !

    

No comments:

Post a Comment