Thursday, September 29, 2011

మొక్కల పెంపక కేంద్రం

నాదెండ్ల హై స్కూల్ దాటిన తరువాత రెండు మొక్కల పెంపక కేంద్రాలు కనిపిస్తాయి. హై స్కూల్ పక్కనే ఉన్న నర్సరీ లోకి వెళ్లి చూద్దామా!!


ఇక్కడ మొక్కలను నాటటానికి నేల కాకుండా గుంటలు కలిగిన రబ్బరు పాడ్ లను వాడుతున్నారు. విత్తనాలను నాటటానికి మట్టికి బదులు కొబ్బరి పీచు కి అంటుకుని ఉండే మెత్తని పదార్ధాన్ని వాడుతున్నారు..
రబ్బరు పాడ్ లోని గుంటలలో కొబ్బరి పీచు లోని మెత్తని పదార్ధాన్ని నింపి అందులో విత్తనాలు నాటుతారు. మొక్క పెరిగిన తరువాత వేర్లు పాడవ కుండ సులువుగా తీయవచ్చు
పాడ్ లను తడపటానికి పైప్స్ ద్వార వాటరింగ్ చేస్తున్నారు. వర్షం పడినప్పుడు కప్పటానికి కవర్స్ రెడీ గా ఉన్నాయి ( పాడ్ లలో ఎక్కువ నీరు చేరి కొబ్బరి పీచు పొడి నుండి మొక్క పడి పోకుండా ఉండటానికి ) .

ప్రస్తుతం ఆర్డర్ పై మిరప నారు పెంచుతున్నారు.
ఖాళీ రబ్బర్ పాడ్ లు.

No comments:

Post a Comment