Wednesday, July 14, 2010

శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం





























నాదెండ్ల గ్రామంలో ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ గంగ పార్వతి సమేత మూల స్థానేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. దీనిని మార్కండేయ మహర్షి స్థల పురాణం. కాకతీయ చక్రవర్తి , గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శివ దేవుడు ఈ ఆలయంలోనే గోళఖి మఠాన్ని స్థాపించి నిర్వహించారని, ఆయన దర్శనార్ధం గణపతి దేవుడు ఈ ఆలయాన్ని దర్శించాడని పురావస్తు శాఖ వారు తెలిపారు.


స్థానికంగా ఈ ఆలయంలో జరిగే కార్తీక పౌర్ణమి పండుగ ఎంతో ప్రసిద్ధి. గ్రామానికి చెందిన నల్లమోతు సీతమ్మ భర్త పొలంలో చనిపోయి యుండగా ఆయనను శివాలయములోకి తీసుకోని వచ్చి, ఆయన బ్రతికితే అఖండము పెట్టించి జ్వాల తోరణము (చిచ్చుల తోరణము) ఏర్పాటు చేయిస్తానని సీతమ్మ గారు స్వామి వారికి మొక్కినది. తెల్లవారే సరికి ఆయనలో కదలిక వచ్చినది. ఆయన బ్రతికినందుకు గుర్తుగా ఆనాటినుండి, కార్తీక పౌర్ణమి నాడు, అఖండ దీపం వెలిగించి, చిచ్చుల తోరణం ఏర్పాటు చేస్తారు. దీని కొరకు సీతమ్మ తోపు పేరుతొ, పదకొండు ఎకరాల మాన్యము ఏర్పాటు చేయించినది.

నేడు ఎంతోమంది గ్రామస్తులు స్వామివారిని నమ్ముకొని ప్రతి సోమవారము మరియు ఆయా విశిష్ట దినములలో స్వామివారికి అభిషేకములు, పూజలు జరిపించుచున్నారు. ఈ ఆలయములో అఖండ దీపారాధన ఉన్నది. ఈ ఆలయము ముస్లిము రాజుల దురాగతానికి గురి అయినట్లు ఆలయములో శాసనముల వలన తెలియు చున్నది.


ఈ ఆలయములో ప్రతి రోజు బిందె తీర్థము, మేళ తాళాలతో అర్చకులు తీసుకోని వస్తారు.
ఈ ఆలయమునకు ధర్మకర్త శ్రీ నల్లమోతు వెంకట నట రాజేశ్వర రావు గారు.
ప్రధాన
అర్చకులు సాంబశివరావు గారు .



















అభిషేకం చేయిస్తున్న భక్తులు.













గర్భాలయం లో పార్వతి అమ్మవారు.






























వీరభద్ర స్వామి





























భద్రకాళి అమ్మవారు.





























స్వామి వారి కళ్యాణ వేదిక


















బాల త్రిపుర సుందరి అమ్మవారు.































నాగవయ్య పడగ












































ఆరుద్ర మండపం(శివ ముక్కోటి నాడు ప్రత్యేక పూజలు జరిపే మండపము)
ప్రముఖ శైవ క్షేత్రాలలో మాత్రమే వుంటుంది.

























ఆలయ వెనుక భాగంలో ఉన్న జమ్మి , మారేడు చెట్లు








ధ్వజస్తంభం





















రధశాల





































కళ్యాణ మండపము





No comments:

Post a Comment