Saturday, April 27, 2013

శ్రీ చెన్న కేశవ స్వామి వారి రధోత్సవం 25-4-13

సొమ్ము గోవర్ధన స్వామిది ....! సోకు చెన్నకేశవ స్వామిది .... !! గోవర్ధన స్వామి ఆలయ  మాన్యాలు గోవర్ధన స్వామి పేరు మీద ఉన్నాయి . ముస్లిముల దండ యాత్ర అనంతర ఆలయ పునర్నిర్మాణం చేపట్టినప్పుడు  చెన్న కేశవ స్వామి వారి విగ్రహాలు మాత్రమే  లభించాయి .  చెన్న కేశవ స్వామి వారు ప్రధాన దేవర గా  ఆలయ నిర్మాణం  జరిగింది  .  ఉత్సవాలన్నీచెన కేశవ స్వామి వారికే జరిపేవారు . అనంతర కాలం  లో  పాలకులు  సమస్యను  తెచ్చారు . మాన్యాలు గోవర్ధన స్వామి పేరు మీద ఉంటే , ప్రధాన దైవంగా  చెన్న కేశవ స్వామి ఉన్నారు..  గోవర్ధన స్వామి లేనప్పుడు ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి అనేది సమస్య . ఈ సమస్య పరిష్కారం కొరకు కనిపించ కుండా  ఉన్న గోవర్ధన స్వామి వారి కొరకు వెతుకుతున్నప్పుడు , స్వామి వారు సాతులూరు సమీపం లో కనిపించారు .  అప్పుడు ఆ గోవర్ధన స్వామి  వారిని  ఆలయం లో ప్రతిష్టించుట జరిగినది . అప్పటినుండి గోవర్ధన స్వామి వారికి  రధోత్సవం తప్ప మిగిలిన అన్ని  సేవలు జరుపుతున్నారు .  

 చెన్న కేశవ స్వామి వారు ఒక్క రధోత్సవం నాడే ప్రధాన దైవంగా గ్రామోత్సవం లో దర్శనమిస్తారు . అత్యంత ఘనమైన రధోత్సవంను చెన్న కేశవ స్వామి వారు జరుపుకుంటారు కాబట్టి గ్రామస్తులు  సొమ్ము గోవర్ధన స్వామిది ... సోకు చెన్న కేశవ స్వామి ది  అని హాస్యమాడుకుంటారు 










  






No comments:

Post a Comment