Sunday, November 14, 2010

జి. ప. చైర్ పర్సన్ గారిచే పలు శంఖుస్థాపనలు- 12-11-10

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కూచిపూడి విజయ గారు నాదెండ్ల గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంఖుస్ఠాపనలలో పాల్గొన్నారు. రాబోవు ఆర్ధిక నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపయోగపడే డొంక రోడ్లు, గ్రావెల్ రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి పూర్తిగా నిధులు వినియోగిస్తామని చెప్పారు. ఆంజనేయస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్.పి. ఉన్నత పాఠశాలలో రాజీవ్ విద్యా మిషన్ ద్వార 8 లక్షల రు. నిధులతో రెండు అదనపు గదుల నిర్మాణానికి శంఖుస్థాపన చేసారు. గ్రామంలోని కచేరి చెట్టు వద్ద నుండి ఆంజనేయస్వామి గుడి వరకు సైడు కాలువల గోడ నిర్మాణానికి మాజీ M.L.A. మర్రి రాజశేఖర్ గారు , కూచిపూడి విజయ గారు , నట రాజేశ్వరరావు గారు,వీరారెడ్డి గారు, సర్పంచ్ నరసమ్మ గారు పూజలు నిర్వహించి శంఖుస్థాపన చేసారు.

అనంతరం ఆమె ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి వార్డెన్ కె. రాజబాబును అభినందించారు. విద్యార్ధులకు యూనిఫాం లను పంపిణీ చేసారు. హాస్టల్ వసతులకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment