Saturday, November 3, 2012

చిలకలూరిపేట, నాదెండ్ల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు 3-11-12

నీలం తుఫాను ప్రభావం వలన గత నాలుగు రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్తి, మిరప చేలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది . గణపవరం దగ్గర కుప్పగంజి వాగు నీరు  సప్టా మీదుగా ప్రవహిస్తుంది. బడులు సక్రమంగా జరగటానికి అంతరాయం ఏర్పడింది. నరసరావు పేట దారిలోని గంగన్నపాలెం సమీపం లో కుప్పగంజి వాగుపై సప్టా స్థానంలో బ్రిడ్జి నిర్మించటం తో హైదరాబాద్ వైపు వెళ్ళటానికి అంతరాయం తప్పింది. లేకుంటే కోటప్ప కొండ   మీదుగా వెళ్ళవలసి వచ్చేది. బావులలో నీరు  బాగా పైకి వస్తుంది. 4,5 అడుగుల లోతులో  నీరు అందుతుంది. నాదెండ్ల నుండి తిమ్మాపురం వైపు ఆటోలు కూడా నడవటం లేదు 
 
  2-11-12 ఉదయం: కేవలం నాలుగు వరల లోతులో నీరు 

 2-11-12 సాయంత్రం 6.30 గంటలు: NRT  సెంటర్ లోని మోడరన్ కాంప్లెక్స్ దగ్గర 

నాదెండ్ల ప్రాంత్రం లో నిండిన కుంటలు 
 




చిలకలూరిపేట శివారు 3-11-13 సాయంత్రం : జలాలు కాదు అవి పొలాలు 

No comments:

Post a Comment