Wednesday, November 14, 2012

ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకొని తెలుగు పండితులకు సన్మానం

డిసెంబర్ నెలలో తిరుపతి లో జరగనున్న ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకొని నాదెండ్ల మండల పరిధి లోని ఉన్నత పాఠశాల లలో పని చేయుచున్న  తెలుగు పండితులకు సన్మానం జరిగింది. ఈ సమావేశానికి MDO  శ్రీమతి D .అనురాధ గారు,  MEO  శ్రీ R .కళ్యాణ రావు గారు, S .I  శ్రీ సాంబశివరావు గారు,ఉన్నత పాఠశాలా ల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు(నాదెండ్ల), శ్రీమతి వెంకటేశ్వ రమ్మ(తూబాడు), మండల పరిధి లోని అన్ని ప్రాధమిక పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్ధులు విచ్చేసారు.


















  మాతృ భాష తెలుగు ఔ న్నత్యాన్ని  చాటి చెప్పాలని, మృత భాష కాకుండా కాపాడుకోవాలని, తియ్యనైన తెలుగు భాష లో మాట్లాడుకోవటం గౌరవంగా భావించాలని, చిన్నప్పటి నుండే అంగ్ల భాష వ్యామోహం తగదని సభికులు సందేశ మిచ్చారు. అనంతరం తెలుగు పండితులు శ్రీ సదాసివ శాస్త్రి గారికి (గణపవరం), శ్రీమతి నాగ జ్యోతి (సాతులూరు ) గారికి సన్మానం జరిగినది. అందరు తెలుగు పండితులను తగు రీతిలో సత్కరించారు.

No comments:

Post a Comment