Wednesday, November 14, 2012

నాదెండ్ల లో బాలల దినోత్సవ సంబరాలు


నాదెండ్ల లోని మండల విద్యావనరుల కేంద్రం వద్ద, బాలల దినోత్సవ సంబరాలు  జరిగాయి మరియు డిసెంబర్ నెలలో తిరుపతిలో జరుగనున్న ప్రపంచ మహా సభలు పురస్కరించుకొని ఉన్నత పాఠశాల  లోని తెలుగు పండితులకు సన్మానం జరిగింది ( తరువాతి పోస్టింగ్ లో సన్మానం ఫోటోలు ).
                  ఉదయం విద్యార్ధులకు శతక  పద్యాలు , నెహ్రు గారి చిత్రపటం గీయుట ,వ్యాస రచన,మొదలైన అంశాలలో పోటీలు నిర్వహించారు. మధ్యాన్నం  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో MDO  గారు, MEO  గారు , S .I గారు, ప్రధానోపాధ్యాయులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు . విద్యార్దుల కు శుభాకాంక్షలు తెలిపారు. పోటిలలో గెలిచిన విద్యార్ధులకు బహుమతులు అందజేసారు . కార్య క్రమంలో పిల్లలచే  నిర్వహించ బడిన సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్య క్రమం విజయ వంతం కావటానికి S .I . శ్రీ సాంబశివరావు గారు ఏంతో  సహకరించారు. విద్యార్ధులకు బహుమతులు ప్రాయోజితం చేసారు 
 ఎడమ నుండి.zphs తూబాడు HM  శ్రీమతి వెంకటేశ్వ రమ్మ గారు  , MEO  శ్రీ రాజనాల కళ్యాణ రావు గారు  , MDO  శ్రీమతి D . అనురాధ గారు, నాదెండ్ల పోలీస్ స్టేషన్ S .I . శ్రీ సాంబశివరావు గారు.


 MPUP  పాఠశాల ,చందవరం విద్యార్ధిని, ఉపాధ్యాయులతో MEO  గారు 
 zphs నాదెండ్ల HM  శ్రీ ఐ. ఆంజనేయులు గారు 



No comments:

Post a Comment