Sunday, March 27, 2011

జీవ వైవిధ్య పరిరక్షణ - ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి 25-03-2011

నాదెండ్ల మండల M.D.O. శ్రీమతి అనురాధ గారు

ఇర్లపాడు ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి వారు, జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమంలో భాగంగా స్థానిక శివాలయం వీధి లోని M.P.P స్కూల్ లో (పెద్ద బడి) అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా మండల M.D.O. శ్రీమతి అనురాధ గారు విచ్చేసారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని ఆమె విద్యార్ధులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ దావులూరి నరసమ్మ, నాదెండ్ల S.I. K. చేన్నకేశ్వర్లు, పంచాయతి సెక్రటరీ J. లూథర్ పాల్, వ్యవసాయ అధికారి K.కిరణ్మయి, ఆడం వీకర్ సెక్షన్ మహిళా మండలి అధ్యక్షురాలు D. శాంతమ్మ, ఇర్లపాడు ఉప సర్పంచ్ M. ఏడుకొండలు, ఉపాధ్యాయులు I. వెంకటేశ్వర రావు, S. రామయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment